(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
సోషల్ మీడియాలో కీలకమైన ట్విట్టర్ యాజమాన్యం జనసేన పార్టీకి షాక్ ఇచ్చింది. జనసేన పార్టీ వ్యవహారాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లే ముఖ్యమైన ఖాతాలను బ్లాక్ చేసింది. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్, జనసేన పార్టీ మద్దతుదారులకు సంబంధించిన ట్విట్టర్ ఖాతాల్ని బ్లాక్ చేసింది. ఎక్కువ ఫాలోయింగ్ ఉన్న ట్రెండ్ పీఎస్పీకే, పవనిజం నెట్ వర్క్, వరల్డ్ పీఎస్పీకే ఫ్యాన్స్, దాస్ పీఎస్పీకే వంటి ఖాతాలను సస్పెండ్ చేయడం చర్చనీయాంశం అయింది.
ట్విట్టర్ ఖాతాలను బ్లాక్ చేయడంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మండిపడ్డారు. ట్విట్టర్ వేదికగానే ఆయన స్పందించారు. జనసేన మద్దతుదారులకు సంబంధించి 400 అకౌంట్లను ట్విట్టర్ ఎందుకు సస్పెండ్ చేసిందో తనకు తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిస్సహాయులైన ప్రజల తరఫున నిలబడినందుకే ఈ ఖాతాలను సస్పెండ్ చేశారా? అంటూ ట్విట్టర్ నిర్వహకులను పవన్ ప్రశ్నించారు. దీన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి..? బ్లాక్ చేసిన తమ ఖాతాలను వెంటనే పునరుద్ధరించాలని పవన్ డిమాండ్ చేశారు.
సోషల్ మీడియాలో పవన్ కల్యాణ్తో పాటు ఆయన మద్దతుదారులు, పార్టీ ఖాతాలకు భారీ సంఖ్యలో ఫాలోవర్స్ ఉన్నారు. ఎప్పటికప్పుడు పవన్ విషయాలు, జనసేన పార్టీ కార్యక్రమాలను షేర్ చేస్తుంటారు. ఇక వీటికి భారీ సంఖ్యలో రీట్విట్లు, లైక్లు, కామెంట్లు కూడా పెట్టి తమ అభిమానాన్ని చాటు కుంటుంటారు.
I don’t understand the reason for suspending 400 twitter accounts of Janasena supporters.The reason behind the suspension of these accounts ; just for standing by helpless people and their issues? And how do we understand this?#BringBackJSPSocialMedia
— Pawan Kalyan (@PawanKalyan) September 18, 2019