(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
దేశంలో దళితులపై ఈ మధ్య కాలంలో దాడులు మరింతగా ఎక్కువయ్యాయి. తాజాగా బిర్యానీ అమ్మినందుకు ఓ దళిత వ్యక్తిపై దాడికి పాల్పడిన ఘటన దేశరాజధాని ఢిలీ సమీపంలో చోటు చేసుకుంది. గ్రేటర్ నోయిడా పరిధిలోని రుబుపురాలో లోకేష్ అనే 43 ఏళ్ల వ్యక్తి బిర్యానీ అమ్ముతున్నాడు. అయితే, లోకేష్ వద్దకు వచ్చిన ఓ వ్యక్తి అతన్ని కులం పేరుతో దూషిస్తూ, విచక్షణారహితంగా కొట్టాడు. ఈ ఘటన శుక్రవారం జరగగా… ఆదివారం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.
#WATCH Greater Noida: A 43-year-old man Lokesh being beaten up by some men, allegedly for selling biryani in Rabupura area. pic.twitter.com/iOfXWuDUiM
— ANI UP (@ANINewsUP) December 15, 2019
ఈ ఘటన అనంతరం బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడని గ్రేటర్ నోయిడాలోని సీనియర్ పోలీసు అధికారి రణవిజయ్ సింగ్ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం దీనిపై దర్యాప్తు చేస్తున్నామని, బాధితుడిపై దాడి చేసిన ముగ్గురి కోసం గాలిస్తున్నామని తెలిపారు.
ఈ ఘటనపై సినీ నటి ఊర్మిళ సైతం స్పందించారు. ‘ఇది మన నాగరికత, సంస్కృతి కాదు. ఇది సబ్కా సాథ్ సబ్కా వికాస్ ఆలోచనకు పూర్తిగా వ్యతిరేకం’ అని హిందీలో ట్వీట్ చేశారు.
भयानक!!! ऐसी घटनाओं से अस्वस्थ ना होनेवाले भारतीय नहीं हो सकते..यह हमारी सभ्यता/संस्कृति नहीं और यह #सबकासाथसबकाविकास तो बिलकुल भी नहीं। #जागो ?? @CMUttarPradesh @PoliceUttar https://t.co/qsEYAOhnOy
— Urmila Matondkar (@UrmilaMatondkar) December 15, 2019