న్యూఢిల్లీ: ఇప్పటి వరకు ఎన్నికల ఖర్చులు తెలియచేయని పార్లమెంట్ సభ్యులపై ఎన్నికల సంఘం (ఈసి) ఆగ్రహం వ్యక్తం చేసింది.
సార్వత్రిక ఎన్నికలు గడిచి పదినెలలు దాటుతున్నా దేశవ్యాప్తంగా 80 మంది పార్లమెంట్ సభ్యులు వారి ఎన్నికల ఖర్చుల వివరాలను ఎన్నికల కమిషన్కు సమర్పించలేదు. అందులో ఆంధ్రప్రదేశ్ కు చెందిన 15 మంది, తెలంగాణకు చెందిన ఇద్దరు ఉన్నారు. ఎలక్షన్లో గెలిచిన అభ్యర్థులు 90 రోజుల్లో ఖర్చు వివరాలను ఈసీకి సమర్పించాల్సి ఉంటుంది.
ఎన్నికల ఖర్చు వివరాలు తెలుపని వారిపై ఈసి ఆగ్రహం వ్యక్తం చేస్తూ జాబితాను విడుదల చేసింది. ఎన్నికల ఖర్చు తెలియచేయని వారిపై చర్యలు తీసుకునే హక్కు తమకు ఉందని ఈసీ హెచ్చరించింది. అఫిడవిట్ దాఖలు చేయని ఎంపీల ఎన్నిక రద్దు చేసే అవకాశం కూడా ఉందని ఎలక్షన్ వాచ్ కన్వీనర్ వివి రావు తెలిపారు.