న్యూజిలాండ్లోని మసీదులో జరిగిన కాల్పుల ఘటనలో తొమ్మిది మంది భారతీయులు గల్లంతు అయినట్లు తెలుస్తుంది.
దుండగుడు కాల్పులకు పాల్పడిన ఘటనలో 49మంది ప్రాణాలు కోల్పోగా మరో 20మంది తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే.
ప్రార్థనల్లో నిమగ్నమైన వారిపై జాతి విద్వేషంతో దుండగుడు విచ్చల విడిగా కాల్పులకు తెరబడి నరమేధం సృష్టించాడు.
ఈ ఘటనలో తొమ్మిది మంది భారతీయుల ఆచూకి గల్లంతు అవ్వగా ఇద్దరు గాయపడినట్లు తెలుస్తోంది, వీరిలో హైదరాబాదుకు చెందిన ఆరుగురు వ్యక్తులు ఉన్నట్లు సమాచారం.
బాధితుల కోసం న్యూజిల్యాండ్లోని భారత రాయబార కార్యాలయంలో హెల్ప్ లైన్ ఏర్పాటు చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. హైదరాబాదు వాసులు గాయపడినట్లు అధికారులు ఇంత వరకూ ప్రకటించలేదు.
హైదరాబాదుకు చెందిన అహ్మద్ ఇక్బాల్ జహంగీర్, అహ్మదాబాద్కు చెందిన మెహబూబ్ ఖోఖర్లు గాయపడ్డారని వారి బంధువులు వెల్లడించారు. జహంగీర్ క్రైస్ట్చర్చ్లో రెస్టారెంట్ నడుపుతున్నాడనీ, కాల్పుల్లో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.