న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్పై చర్యలు తీసుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీ (అప్) ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఢిల్లీ ఎన్నికల ప్రచారం నుంచి నిషేధించాలని ఎన్నికల సంఘానికి ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్ చేసింది. యోగి ఆదిత్యనాథ్ విధ్వేష ప్రసంగాలు చేస్తున్నారని ఈసీకి రాసిన లేఖలో ఆప్ పేర్కొంది.
యోగి ఆదిత్యనాథ్ ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో విధ్వేషాలు రెచ్చగొడుతున్నారనీ, ఎన్నిక నియామవళిని ఏమాత్రం పాటించడంలేదని ఫిర్యాదు లో పేర్కొన్నది. ఎన్నికల ప్రచారం నుంచి యోగికి నిషేధం విధించాలనీ, దానితో పాటుగా ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఈసీకి రాసిన లేఖలో ఆప్ డిమాండ్ చేసింది.
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఢిల్లీలో ఆప్, బీజేపీలు విస్తృత స్థాయిలో ప్రచారం చేస్తున్నాయి.
ఢిల్లీలో బీజేపీకి మద్దతుగా నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు.