ఢిల్లీ,మార్చి 2 : పాకిస్తాన్కు చిక్కిన భారత వైమానిక దళ వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ను ఆ దేశ ఆర్మీ శారీరకంగా వేధించనప్పటికీ.. మానసికంగా వేధించనుట్లు తెలుస్తోంది. దాదాపు 60గంటల పాటు అభినందన్ పాకిస్తాన్లో ఉన్నారు. ఆ సమయంలో ఆయనను పాక్ ఆర్మీ మానసికంగా వేధించిందని అభినందన్ భారత అధికారులకు తెలిపినట్లు ఏఎన్ఐ వార్తా ఏజెన్సీ వెల్లడించినది.
ఫిబ్రవరి 27న పాకిస్తాన్ ప్రతీకార దాడుల్ని తిప్పికొట్టే క్రమంలో మిగ్–21 విమానం కూలిపోయినది. అభినందన్ పాక్ భూభాగంలో పడిపోయారు. అతడిపై అక్కడి స్థానికులు దాడి చేశారు. తర్వాత పాక్ ఆర్మీ ఆయనను తమ ఆధీనంలోకి తీసుకున్నది.
అభినందన్ను శుక్రవారం రాత్రి 9.20 గంటలకు వాఘా బార్డర్ దగ్గర భారత్కు పాక్ అప్పగించినది.
స్వదేశంలో అడుగుపెట్టిన అభినందన్ను ఢిల్లీలోని మిలిటరీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అక్కడి నుంచి ఎయిర్ ఫోర్స్ ఆసుపత్రికి తరలించారు.
ఢిల్లీలోని ఎయిర్ ఫోర్స్ ఆసుపత్రిలో ఉన్న అభినందన్ను రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు కలిసి పరామర్శించారు. విమానం నుంచి ల్యాండ్ అయిన పరిస్థితులు, పాక్ సైన్యం అదుపులోకి తీసుకున్న తర్వాత జరిగిన పరిణామాలను అడిగి తెలుసుకున్నారు.
అభినందన్ కుటుంబసభ్యులు, పలువురు ఇండియన్ ఎయిర్ఫోర్స్ ఉన్నతాధికారులు కూడా అతడిని ఆసుపత్రిలో కలిశారు.