(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
హైదరబాద్ లో సంచలనం సృష్టించిన వెటర్నరీ డాక్టర్ ప్రియాంకరెడ్డి హత్యాచారంపై నటి కీర్తి సురేశ్ స్పందించింది. మహిళలకు ఎంతో సురక్షితమైనదని భావించే హైదరాబాద్ నగరంలో ప్రియాంకరెడ్డి దారుణ హత్యకు గురికావడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. “డాక్టర్ ప్రియాంకా రెడ్డిపై అత్యాచారానికి పాల్పడి, సజీవదహనం చేశారన్న వార్త నా హృదయాన్ని కలచివేసింది. రోజురోజుకూ పరిస్థితులు చాలా దారుణంగా మారుతున్నాయి. హైదరాబాద్ నగరం అంటే సురక్షిత ప్రాంతమని నేను నమ్మేదాన్ని. కానీ అలాంటి చోట కూడా ఇలాంటి దారుణ సంఘటన జరగడంతో.. నాకు ఏ మాట్లాడాలో కూడా తెలీడం లేదు. ఈ ఘటనలో ఎవరిని నిందించాలి ? ఈ దేశంలో మహిళలు స్వేచ్ఛగా సంచరించే సమయం ఎప్పుడొస్తుందో ? నిందితులందరికీ కఠినంగా శిక్షించాలి. ప్రియాంకరెడ్డి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా. ఈ కష్టం నుంచి వారు త్వరగా బయట పడాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. నేను కర్మను నమ్ముతాను. అది 24/7 పనిచేస్తూనే ఉంటుంది” అని కీర్తి సురేశ్ తన ట్వీట్ లో పేర్కొంది.
#RIPPriyankaReddy #JusticeForPriyankaReddy pic.twitter.com/9vCKsbsj1O
— Keerthy Suresh (@KeerthyOfficial) November 29, 2019
మరోవైపు వెటర్నరీ డాక్టర్ ప్రియాంకరెడ్డి హత్యకేసును పోలీసులు ఛేదించారు. దర్యాప్తులో భాగంగా నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. సీసీటీవీ పుటేజ్ ఆధారంగా లారీ డ్రైవర్, క్లీనర్తో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఘనట జరిగిన 24 గంటల్లోనే ఛేదించి నిందితులను కూడా పట్టుకున్నారు. స్కూటీ టైర్ పంక్చర్ చేసి నిందితులు డ్రామాలు ఆడారని పోలీసులు గుర్తించారు.