ఢిల్లీ: ఆప్ రెబల్ ఎమ్మెల్యే అల్కా లాంబా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. ఆమ్ ఆద్మీ పార్టీకి ఆమె రాజీనామా చేశారు. ఢిల్లీలోని చాందినిచౌక్ నుంచి ఆప్ ఎమ్మెల్యేగా గెలుపొందిన అల్కా తాను పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆమె ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘ఆప్ కి గుడ్ బై చెప్పే సమయం వచ్చేసింది. పార్టీ ప్రాథామిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నా. గత ఆరు సంవత్సరాల కాలంలో ఎంతో నేర్చుకున్నా’ అని ట్విట్టర్ లో అల్కా పేర్కొన్నారు.
The time has come to say
"Good Bye" to #AAP and to resign from the primary membership of the Party.
The past 6years journey was a great learning for me.Thanks to all. ???. #JaiHind #ChandniChowk #MLA #AlkaLamba #Delhi
— Alka Lamba (@LambaAlka) September 6, 2019
ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఢిల్లీలో ఆప్ ఓటమికి బాధ్యత తీసుకోవాలని సీఎం కేజ్రీవాల్ను అల్కా బాహాటంగా కోరడంతో పార్టీ ఎమ్మెల్యేల అధికారిక వాట్సాప్ గ్రూప్ నుంచి ఆమెను తొలగించారు. దీంతో గత కొద్దినెలలుగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న అల్కా లాంబా ఇటీవల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో భేటీ అయిన సంగతి తెలిసిందే. సోనియాను ఆమె నివాసంలో కలిసిన అల్కా.. పార్టీలో చేరే విషయమై సంప్రదింపులు జరిపారు. 2020లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ సమావేశం జరగడంతో అల్కా లాంబా కాంగ్రెస్ గూటికి చేరడం ఖాయమని ప్రచారం జరుగుతోంది.