(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు చేస్తున్న ఆందోళనలు 30వ రోజుకు చేరాయి. పండుగ రోజుల్లో కూడా రైతులు నిరసన కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. మందడం, తుళ్లూరు, వెలగపూడి, కృష్ణాయపాలెంలో రైతులు నిరాహార దీక్షలు చేస్తున్నారు.
రాజధాని పరిరక్షణ కోసం పండుగ రోజుల్లోనూ పస్తులు ఉండాలని నిర్ణయించుకున్నారు. దీక్షల్లో రైతులతో పాటు మహిళలు, యువతులు కూర్చున్నారు. నవులూరు, నిడమర్రు, ఎర్రబాలెం ఇతర రాజధాని గ్రామాల్లోనూ రైతులు నిరసనలు కొనసాగిస్తున్నారు.
గురువారం రాజధాని గ్రామాల్లో టిడిపి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, సిపిఐ నేతలు నారాయణ, రామకృష్ణ తదితరులు పర్యటించి రైతుల ఆందోళనకు సంఘీభావం తెలియజేయనున్నారు.