(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని రైతులు చేస్తున్న ఆందోళనలు 42వ రోజుకు చేరాయి.
తుళ్లూరు, ఎర్రబాలెం, వెలగపూడి, మందడం గ్రామాల్లో నిరసన ప్రదర్శనలు ఉధృతంగా నిర్వహిస్తున్నారు. ఆందోళనలు మరింత ఉధృతం చేయాలని రైతులు నిర్ణయించారు.
మరో పక్క రాయపూడిలో జలదీక్షతో రైతులు నిరసన తెలియజేస్తున్నారు.
మూడు రాజధానులు వద్దు – అమరావతే ముద్దు అంటూ నినాదాలు చేస్తున్నారు. ఆందోళన కార్యక్రమాల్లో రైతులు, మహిళలు పాల్గొన్నారు.