(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి రైతులు చేస్తున్న ఆందోళనలు 47వ రోజు కు చేరాయి. తుళ్ళూరు, మందడం, పెదపరిమి, తాడికొండ అడ్డరోడ్డు లో మహా ధర్నాలు కొనసాగిస్తున్నారు. వెలగపూడిలో రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. మందడం,వెలగపూడి, తుళ్లూరులో రైతులు, మహిళల ఆందోళనకు బిజెపి, జనసేన నాయకులు సంఘీభావం తెలియజేయనున్నారు. తాడికొండ అడ్డరోడ్డు వద్ద ధర్నా , ట్రాక్టర్ ర్యాలీలో టిడిపి నాయకులు ధూళిపాళ్ల నరేంద్ర, వంగవీటి రాధలు పాల్గొన్నారు. మరో పక్క జెఏసి ఆధ్వర్యంలో తుళ్ళూరులో మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు.