అమరావతి: మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి ప్రాంతంలో రైతులు, మహిళల ఆందోళనలు 51వ రోజుకు చేరాయి. మందడం, తుళ్లూరులో ధర్నాలు, వెలగపూడిలో 51వ రోజు రిలే దీక్షలు ప్రారంభమైయ్యాయి. రాజధాని మిగతా గ్రామాల్లోనూ ఆందోళనలు కొనసాగుతున్నాయి. మందడం, వెలగపూడిలోను నేడు 24 గంటల దీక్షకు రైతులు కూర్చోనున్నారు. మందడం మహిళలు జలదీక్షలతో నిరసన తెలియచేస్తున్నారు.
మాజీ ఎంపి హర్షకుమార్ నేడు రాజధాని గ్రామాల్లో పర్యటించి రైతులను పరామర్శించనున్నారు.