అమరావతి: మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాజధాని రైతులు నిర్వహిస్తున్న ఆందోళనలు 54వ రోజుకి చేరుకున్నాయి. రాజధాని గ్రామాల్లో నేడు బైక్ ర్యాలీ నిర్వహించాలని తొలుత భావించినా పోలీసులు అనుమతి నిరాకరించడంతో దీక్షా శిబిరాల్లోనే రైతులు నిరసన దీక్షలు చేస్తున్నారు. మందడం, తుళ్లూరులో మహా ధర్నా నిర్వహిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. వెలగపూడిలో 54వ రోజు రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. వెలగపూడి, ఉద్దండరాయునిపాలెం తదితర రాజధాని గ్రామాల్లోనూ రైతుల ఆందోళనలు నిర్వహిస్తున్నారు. మందడం, వెలగపూడిలో రైతుల 24 గంటల దీక్షలూ కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం నుండి రాజధాని ఇక్కడే కొనసాగిస్తామని హామీ వచ్చే వరకు ఆందోళనలు విరమించేది లేదనీ రైతులు స్పష్టం చేస్తున్నారు. అమరావతి రైతుల ఆందోళన లకు మద్దతుగా కృష్ణా, గుంటూరు, ప్రకాశం తదితర జిల్లాలో జేఏసీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి.
previous post
next post