అమరావతి : మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాజధాని రైతులు నిర్వహిస్తున్న ఆందోళనలు 57వ రోజుకి చేరాయి. మందడం, తుళ్లూరులో ధర్నాలు కొనసాగుతున్నాయి. వెలగపూడిలో 57వ రోజు రిలే దీక్షలు జరగనున్నాయి. వెలగపూడి, ఉద్దండరాయునిపాలెం తదితర రాజధాని గ్రామాల్లోనూ రైతుల ఆందోళనలు కొనసాగిస్తున్నారు. నేడు మందడం, వెలగపూడిలోనూ రైతులు 24 గంటల దీక్షకు కూర్చున్నారు. రాజధాని అమరావతిలోనే ఉండాలని పలువురు రైతు కూలీలు, మహిళలు షిరిడి వెళ్లి మొక్కు తీర్చుకునేందుకు బయలుదేరారు. సేవ్ అమరావతి, మూడు రాజధానులు వద్దు, ఒక్క రాజధానే ముద్దు అంటూ నినాదాలు చేస్తున్నారు.
previous post