(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: రాజధాని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ అమరావతి ప్రాంత రైతులు చేపట్టిన ఆందోళన బుధవారం నాటికి 36వ రోజుకు చేరింది. మూడు రాజధానుల బిల్లు అసెంబ్లీలో అమోదించిన నేపథ్యంలో అమరావతి పరిరక్షణ సమితి (జెఏసి) ఆధ్వర్యంలో నేడు కృష్ణా, గుంటూరు జిల్లాల బంద్కు పిలుపునిచ్చింది.
మందడం, తుళ్లూరు,వెలగపూడి, కృష్ణాయపాలెం, ఎర్రబాలెం, నిడమర్రు, నవులూరు, ఉద్దండరాయునిపాలెంలో రైతు రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు.
కాగా నేటి బంద్కు ఎలాంటి అనుమతులు లేవని గుంటూరు జిల్లా పోలీసులు పేర్కొన్నారు. ఆందోళనకారులు బలవంతంగా పాఠశాలలు, షాపులు మూసివేయిస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని పేర్కొంటున్నారు.
మరో వైపు రాజధాని గ్రామాలకు అమరావతి జెఏసీ నేతలు పర్యటిస్తున్నారు. పోలీసుల లాఠీచార్జ్లో గాయపడిన రైతులను జెఏసి నేతలు పరామర్శించనున్నారు.