(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: అమరావతి పరిరక్షణ సమితి (జెఏసి) నేతలు ఈ రోజు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్తో సమావేశం కానున్నారు. చంద్రబాబుతో సహా అఖిలపక్ష నేతలు మూడు రాజధానుల సమస్యను గవర్నర్కు వివరించనున్నారు. రాజధాని గ్రామాల్లో మహిళలపై పోలీసుల దాడులు, 144 సెక్షన్ అమలుపై గవర్నర్కు ఫిర్యాదు చేయడంతో పాటు విజయవాడలో మహిళల ర్యాలీని అడ్డుకోవడం, పోలీసు స్టేషన్లో నిర్బంధించిన పరిమాణాలు, రైతుల ఆందోళనలు, రాజధాని మార్పు వల్ల కలిగే నష్టాలను గవర్నర్కు నేతలు వివరించనున్నారు.
మూడు రాజధానుల అంశానికి సంబంధించి జరుగుతున్న పరిమాణాలపై ఇంతకు ముందు ఒక పర్యాయం అమరావతి ప్రాంత రైతులు, మరో పర్యాయం టిడిపి నేతలు గవర్నర్ను కలిసి వినతి పత్రం సమర్పించిన విషయం తెలిసిందే.