(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
అమరావతి: ఏపి రాజధాని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు చేపట్టిన ఆందోళనలు 22వ రోజుకు చేరాయి. మందడంలో రైతుల ధర్నాలో కూర్చోకునేందుకు షామియానా (టెంట్) వేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అనుమతి నిరాకరిస్తూ అడ్డుకున్నారు. దీంతో రైతులు రహదారిపైనే భైటాయించి ధర్నా చేస్తున్నారు. వెలగపూడి, కృష్ణాయపాలెంలో కూడా రైతుల దీక్షలు కొనసాగుతున్నాయి. అమరావతిలోనే రాజధాని కొనసాగించాలంటూ రైతులు నినాదాలు చేస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మందడం, వెలగపూడి గ్రామాల్లో పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు. సిఎం సచివాలయానికి వెళ్లే మార్గంలో ప్రత్యేక నిఘాతో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు.