అమరావతి: నిరసనలు, నిరాహార దీక్షలు, ఆందోళనతో అమరావతి అట్టుడుకుతోంది. ముఖ్యమంత్రి జగన్ చేసిన మూడు రాజధానుల ప్రకటనకు వ్యతిరేకంగా రైతులు రోడ్డుపై నిరసనలు తెలుపుతున్నాయి. రాజధాని కోసం తమ విలువైన భములు పణంగా పెట్టి ప్రభుత్వానికి అప్పగిస్తే ఇప్పుడు తమను మోసం చేశారంటూ పార్టీలకు అతీతంగా రైతులు రోడ్డెక్కుతున్నారు.
సచివాలయం చుట్టుపక్కల గ్రామాలు రోడ్లపైకి వచ్చి బంద్లు, ధర్నాలకు దిగడంతో బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. గుంటూరు, విజయవాడ నుండి వచ్చే వాహనాలను మందడం, తుళ్లూరు. వెలగపూడి గ్రామాల వద్ద రైతులు అడ్డుకున్నాయి. దీంతో వాహనాలు భారీ సంఖ్యలో నిలిచిపోయాయి. మందడం గ్రామంలో జరిగిన మహాధర్నాలో పెద్ద సంఖ్యలో రైతులతో పాటు మహిళలు పాల్గొన్నారు. తుళ్లూరులో వంటా వార్పుతో నిరసన తెలియజేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జనసేన నేతలు కొణిదన నాగబాబు, నాదెండ్ల మనోహర్ తదితర నేతలు రైతుల ఆందోళనకు సంఘీభానం తెలిపారు.