అమరావతి : మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి ప్రాంతంలో రైతులు నిర్వహిస్తున్న ఆందోళనలు 50వ రోజుకి చేరుకున్నాయి. నేడు రాజధాని గ్రామాల్లో టిడిపి అధినేత నారా చంద్రబాబు పర్యటించనున్నారు. రాజధాని రైతులు నేడు వినూత్న నిరసనలు చేపట్టనున్నారు. చేతి వృత్తులు, కుల వృత్తులు చేసే వారితో కలిపి నేడు నిరసనలు చేయనున్నారు. మందడం, తుళ్లూరులో ధర్నా చేపట్టారు. వెలగపూడిలో 50వ రోజు రిలే దీక్షలు. మిగతా రాజధాని గ్రామాల్లోనూ రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. తుళ్లూరులో రైతులు చేస్తున్న 50 గంటల దీక్ష నేడు ముగింపునకు చేరుకున్నది.
మరో పక్క రాజధాని గ్రామాలలోని రైతులలో ఒక వర్గం వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో సిఎం జగన్మోహన్ రెడ్డిని కలవడం సంచలనంగా మారింది.