ముంబై: ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సతీమణి అమృత ఫడ్నవీస్ వివాదంలో చిక్కుకున్నారు. సెప్టెంబర్ 17న ప్రధాని నరేంద్ర మోదీ 69వ జన్మదినం సందర్భంగా ఆయనకి శుభాకాంక్షులు తెలిపిన అమృత ఫడ్నవీస్.. మోదీని జాతిపితగా అభివర్ణించారు.
Wishing the Father of our Country @narendramodi ji a very Happy Birthday – who inspires us to work relentlessly towards the betterment of the society ! #HappyBDayPMModiJi #HappyBdayPMModi #HappyBirthdayPM #happybirthdaynarendramodi pic.twitter.com/Ji2OMDmRSm
— AMRUTA FADNAVIS (@fadnavis_amruta) September 17, 2019
‘ఫాదర్ ఆఫ్ అవర్ కంట్రీ నరేంద్ర మోదీజీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు. సమాజ శ్రేయస్సు కోసం అహర్నిశలు పని చేస్తున్న మీరు మా అందరికీ ఆదర్శప్రాయం’ అని అమృత తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. ఈ ట్వీట్ వైరల్ అయిపోయింది. అమృత వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో విమర్శలు మొదలయ్యాయి.
Father of nation is Mahatma Gandhi and now this father of country is new?? When did PM Modi become father of country and how?? what betterment of society really happened now with unemployment rising like never before and with economy facing slowdown?https://t.co/jLIW79vTYR
— Vidya (@Vidyaraj51) September 17, 2019
‘ఫాదర్ ఆఫ్ నేషన్ మహాత్మాగాంధీ అని తెలుసు..ఇప్పుడు కొత్తగా ఫాదర్ ఆఫ్ కంట్రీ కూడా వచ్చిందా..?’ అని నెటిజెన్ ప్రశ్నించాడు. ‘మోదీ దేశానికి ఫాదర్ ఎప్పుడయ్యారు..? దేశ పురోగతి కోసం ఆయన చేసిందేంటి.. ఓవైపు నిరుద్యోగం,మరోవైపు ఆర్థిక పరిస్థితి దిగజారుతున్నాయి’ అంటూ ఓ నెటిజెన్ మండిపడ్డాడు. గతంలో అమృత సెల్ఫీ వివాదంలోనూ చిక్కుకున్న సంగతి తెలిసిందే.సముద్రంలో క్రూయిజ్ షిప్ అంచున కూర్చుని ఆమె దిగిన సెల్ఫీ విమర్శలు కొని తెచ్చుకుంది.
Father of our nation is only Mahatma Gandhi
— Sidrah (@SidrahDP) September 17, 2019
జన్మదినం సందర్భంగా ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో పర్యటించిన సంగతి తెలిసిందే. తన తల్లి హీరాబెన్ ఆశీర్వాదం తీసుకున్నారు. అమ్మతో కలిసి అల్పాహారం చేసిన మోదీ.. తర్వాత కాసేపు ఆమెతో ముచ్చటించారు. 98 ఏళ్ల హీరాబెన్ గుజరాత్లోని గాంధీ నగర్లో తన చిన్న కొడుకు వద్ద ఉంటున్నారు. నర్మదా జిల్లాలోని కేవాడియాలో అభివృద్ధి కార్యక్రమాలు, వివిధ ప్రాజెక్టు పనుల పురోగతిని సమీక్షించారు. సర్దార్ సరోవర్ డ్యామ్ వద్ద నర్మదా నదికి హారతి ఇచ్చారు. గత ఏడాది అక్టోబర్లో సర్దార్ పటేల్ భారీ విగ్రహాన్ని ఆవిష్కరించిన మోదీ.. మంగళవారం ఆ విగ్రహం వద్ద ఏరియల్ సర్వే నిర్వహించారు.