అమరావతి: రాష్ట్రంలో 30వేల లోపు ఉద్యోగాలన్నీ అవుట్ సోర్సింగ్ పద్ధతిలో నియామకాలు చేసేందుకు జగన్మోహనరెడ్డి ప్రభుత్వం నూతనంగా ఆంధ్రప్రదేశ్ కార్పోరేషన్ ఫర్ అవుట్ సోర్స్డ్ సర్వీసెస్ (ఆప్కాస్) పేరిట పబ్లిక్ లిమిటెడ్ కంపెనీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఫర్ అవుట్సోర్స్డ్ ఎంప్లాయిస్ (అప్కాస్) వెబ్సైట్ను ముఖ్యమంత్రి జగన్ లాంఛనంగా ప్రారంభించారు.
జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు. రాష్ట్ర స్థాయిలోని సెక్రటేరియట్లో కూడా అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలను ఈ కార్పొరేషన్ పరిధిలోకి తీసుకువస్తున్నారు.ఈ కార్పొరేషన్ పెడుతున్నామో కారణాలు ప్రజలందరికీ తెలియాల్సిన అవసరం ఉందని సిఎం జగన్మోహనరెడ్డి అన్నారు.
మధ్యవర్తులను పూర్తిగా తొలగించాలన్నదే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ సర్వీసెస్ను ప్రారంభించిందనానరు. జీతం ఇచ్చేటప్పుడు ఉద్యోగులను మోసం చేయకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని జగన్ తెలిపారు. లంచాలు తీసుకుని అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి ఇక ఉండకూడదని ఆయన పేర్కొన్నారు.
ఎస్సి, ఎస్టి, బిసి, మైనార్టీ వర్గాలకు చెందిన 50 శాతం మంది ప్రతి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాల్లో ఉండాలనీ, జిల్లా స్థాయిలో యాభై శాతం ఉద్యోగాలు మహిళలకే కేటాయించడం జరుగుతుందనీ జగన్ తెలిపారు.
అవుట్ సోర్స్డ్ ఉద్యోగులకు జీతాలు ఇచ్చిన తర్వాతనే అధికారులు జీతాలు తీసుకునే స్థాయిలోకి రావాలని ఆయన అన్నారు. డిసెంబర్ 15నాటికి ఉద్యోగాల జాబితాలు కమిటీ నుంచి శాఖాధిపతుల నుంచి రావాలని జగన్ చెప్పారు. ప్లేస్మెంట్ ఆర్డర్స్ జనవరి ఒకటి నుండి అందించాలనీ, ప్రతి అవుట్ సోర్సింగ్ ఉద్యోగానికి ఒక కోడ్ నంబర్ ఇస్తారనీ తెలిపారు. ప్రతి కాంట్రాక్టును ఒక ఎంటిటీగా తీసుకోవాలన్నారు. జిల్లా స్థాయిలో ఇన్ఛార్జి మంత్రి అప్రూవల్ అథారిటీగా ఉంటారనీ, జిల్లా కమిటీకి కలెక్టర్ నేతృత్వం వహిస్తారనీ తెలిపారు. సెక్రటేరియట్ వచ్చే సరికి సంబంధిత శాఖ మంత్రి అప్రూవల్ అథారిటీగా, సంబంధిత శాఖ కార్యదర్శి కమిటీకి కన్వీనర్గా ఉంటారని జగన్ వెల్లడించారు.