అమరావతి: మూడు రాజధానుల బిల్లును ఏపీ శాసనసభ ఆమోదించింది. ఈ బిల్లుపై అసెంబ్లీలో సుధీర్ఘంగా చర్చ జరిగింది. సీఎం జగన్ ప్రసంగం తర్వాత ఈ బిల్లుకు మెజార్టీ వైసీపీ ఎమ్మెల్యేలు ఆమోదం తెలిపారు. దీంతో స్పీకర్ తమ్మినేని ఈ బిల్లును ఆమోదిస్తున్నట్లు ప్రకటించారు. విశాఖపట్నంలో సచివాలయం, రాజ్ భవన్, హె హెచ్ ఒ డిలను, కర్నూలులో హైకోర్టు, అమరావతిలో శాసనసభ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అసెంబ్లీలో బిల్లు పెట్టింది.
previous post