అమరావతి: ఆంద్రప్రదేశ్ శాసనసభ బుధవారం కొలువుతీరనుంది. ఫిరాయింపు శాసనసభ్యులపై చర్యలు తీసుకోనందుకు నిరసనగా 2017లో అసెంబ్లీనే బహిష్కరించిన వైసిపి నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్ర్రి హోదాలో శాసనసభలో అడుగు పెట్టనున్నారు.
నవ్యాంధ్ర మొదటి శాసనసభలో సభానాయకుడిగా ముఖ్యమంత్రి హోదాలో కూర్చున్న టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఈసారి ప్రతిపక్షనేత హోదాలో కూర్చోబోతున్నారు. 175 మంది సభ్యులు సభలో అధికారపక్షానికి 151 మంది సభ్యులు ఉన్నారు. టిడిపి తరపున 23 మంది మాత్రమే ఎన్నికయ్యారు. మిగిలిన ఒక్క సభ్యుడూ జనసేన ప్రతినిధి.
మొదటి రోజన ప్రోటెం స్పీకర్ శంబంగి అప్పల నాయుడు నూతన సభ్యులతో ప్రమాణస్వీకారం చేయిస్తారు. 13వ తేదీన ఆముదాలవలస సభ్యుడు తమ్మినేని సీతారాంను సభ స్పీకర్గా ఎన్నుకుంటుంది. డిప్యూటీ స్పీకర్ను కూడా ఈ సమావేశాలలోనే ఎన్నుకుంటారు.
14 వ తేదీన గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్ శాసనసభ, శాసనమండలి సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ అసెంబ్లీ సమావేశాలు 18 వ తేదీ వరకూ జరుగుతాయి.