(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి : శాసనమండలి రద్దుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన కొద్దిసేపటికి క్రితం జరిగిన కేబినెట్ భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నది. భోగాపురం ఎయిర్పోర్టు, మచిలీపట్నం పోర్టులపై కేబినెట్లో చర్చించినట్లు సమాచారం. పేదలకు ఇళ్ల పట్టాలకు భూకేటాయింపులపై కూడా కేబినెట్లో చర్చించారు.
మండలి రద్దు నిర్ణయం సందర్భంగానే మరో రెండు కీలక అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కడపలో ఆర్ అండ్ బీ కార్యాలయం ప్రాంగణంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని తొలగించాలన్న తీర్మానాన్ని కూడా కేబినెట్ ఆమోదించింది. అలాగే చినజియ్యర్ స్వామి ట్రస్టుకు విజయవాడ ఇద్రకీలాద్రిపై 40 ఎకరాలు కేటాయిస్తూ మరో తీర్మానానికి కూడా ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది.
మండలి రద్దుపై కాసేపట్లో అసెంబ్లీలో చర్చ జరగనున్నది. చర్చ తర్వాత మండలి రద్దు తీర్మానాన్ని అసెంబ్లీ ఆమోదించనుంది. అనంతరం అసెంబ్లీ తీర్మానాన్ని కేంద్రానికి పంపనున్నది.