అమరావతి: ఏపి మంత్రివర్గ సమావేశాన్ని మరల 20వ తేదీకి మార్పు చేశారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహానీ ఉత్తర్వులు జారీ చేశారు.తొలుత ఈ నెల 20వ తేదీన జరుగు మంత్రివర్గ సమావేశాన్ని 18వ తేదీ శనివారం మధ్యాన్నం మూడు గంటలకు మార్పు చేసినట్లు ఉత్తర్వులు జారీ అయ్యాయి.
ఆ తరువాత మరల మార్పు చేస్తూ జారీ చేసిన ఉత్తర్వులో 20వ తేదీ జనవరి నెల బదులు 20వ తేదీ డిసెంబర్ నెలగా తప్పు దొర్లింది. దీనితో మరల సిఎస్ సెర్కులర్ జారీ చేశారు.
20వ తేదీ సోమవారం ఉదయం తొమిది గంటలకు వెలగపూడి సచివాలయం మొదటి అంతస్తులోని క్యాబినెట్ మీటింగ్ హాలులో మంత్రి వర్గ సమావేశం నిర్వహిస్తున్నట్లు ఉత్తర్వులో పేర్కొన్నారు.