అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి శనివారం చేపట్టనున్న మంత్రివర్గ విస్తరణలో ఐదుగురిని డిప్యూటి ముఖ్యమంత్రులుగా, 20మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. మంత్రివర్గ కూర్పుపై ఇప్పటికే కసరత్తు పూర్తి చేసిన సిఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ఎవరెవరికి అవకాశం కల్పిస్తోంది నేటి సాయంత్రానికి స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. ఎమ్మెల్యేలకు నేరుగా ఫోన్ చేసి చెబుతానని వైసిపి ఎల్పి సమావేశంలో సిఎం జగన్ వెల్లడించారు.
దాదాపుగా మంత్రివర్గంలో ఖాయం అయిందని ప్రచారం జరుగుతున్న ఎమ్మెల్యేల పేర్లు, నియోజకవర్గాలు
అంజాద్ బాషా (ముస్లిం మైనార్టీ, కడప)
మేకతోటి సుచరిత (ఎస్సి, పత్తిపాడు)
ఆళ్ల నాని ( కాపు, ఏలూరు)
రాజన్న దొర (ఎస్టి, సాలూరు)
కొలుసు పార్థసారధి (యాదవ – బిసి, పెనమలూరు)
మేకపాటి గౌతమ్ రెడ్డి (ఆత్మకూరు)
బుగ్గన రాజేంధ్రనాధ్ రెడ్డి (డోన్)
విశ్వరూప్ (అమలాపురం)
పిల్లి సుభాష్ చంద్రబోస్ (ఎమ్మెల్సీ)
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (పుంగనూరు)
బొత్స సత్యనారాయణ (కాపు, చీపురుపల్లి)
ధర్మాన కృష్ణదాస్(నరసన్నపేట)
ప్రసాదరాజు (క్షత్రియ, నరసాపురం)
గ్రంధ శ్రీనివాస్ (భీమవరం)
బాలరాజు (ఎస్టి, పోలవరం)
పేర్ని నాని (కాపు, బందరు)
ముత్యాలనాయుడు (కొప్పుల వెలమ- బిసి, మాడుగుల)
బాలినేని శ్రీనివాసరెడ్డి (రెడ్డి- ఒసి, ఒంగోలు)
అదిమూలపు సురేష్ (ఎస్సి, యర్రగొండపాలెం)
అంబటి రాంబాబు (కాపు- ఒసి, సత్తెనపల్లి)
స్పీకర్గా తమ్మినేని సీతారాం