(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
అమరావతి: ప్రభుత్వ పరిపాలనలో తన దైన మార్కు ప్రదర్శిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి సరి కొత్త ఆలోచనతో తాజాగా తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నట్లు తెలుస్తోంది. మంగళవారం ఏర్పాటు చేసిన విందుకు జిల్లా కలెక్టర్లు, ఎస్పిలు హజరుకానవసరం లేదంటూ ముఖ్యమంత్రి కార్యాలయం (సిఎంఒ) నుండి వర్తమానం పంపారు.
అసెంబ్లీ సమావేశాల ముగింపు సందర్భంగా సిఎం జగన్ బరం పార్క్లో మంగళవారం రాత్రి ఏర్పాటు చేస్తున్న విందుకు జిల్లా కలెక్టర్లు, ఎస్పిలు, ఆయా జిల్లాల ప్రజా ప్రతినిధులను ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంలో 13 జిల్లాలకు 13 టేబుళ్లు ఏర్పాటు చేస్తున్నారనీ, ఒక్కొ టేబుల్ వద్ద సిఎం జగన్ పది నిమిషాల సమయం వెచ్చింది ఆయా జిల్లాల పరిస్థితులు, సమస్యలు, ఫిర్యాదు, పెండింగ్ వ్యవహారాలు వంటి అంశాలపై చర్చించనున్నారనీ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. ప్రధానంగా జనవరిలో నిర్వహించే రచ్చబండ కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకుని కూడా ఈ విందు ఏర్పాటు చేస్తున్నారని కూడా వార్తలు వచ్చాయి.
అయితే అనూహ్యంగా ఈ విందుకు కలెక్టర్లు, ఎస్పిలు రానవసరం లేదంటూ నిన్న సాయంత్రం సిఎంఒ నుండి సమాచారం ఇచ్చిన్నట్లు తెలుస్తోంది. నేడు ఏర్పాటు చేస్తున్న విందు మంత్రులు, ఎమ్మెల్యేలు, విజయవాడలో ఉండే సివిల్ సర్వీస్ అధికారులకు మాత్రమేనని సమాచారం.