(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
హైదరాబాద్: జగన్ అక్రమార్కుల కేసు విచారణ ఈ నెల 17వ తేదీకి వాయిదా పడింది. డిశ్చార్జి పిటిషన్లు అన్నీ కలిపి విచారణ జరపాలన్న జగన్ పిటిషన్పై సిబిఐ ప్రత్యేక కోర్టులో శుక్రవారం వాదనలు పూర్తయ్యాయి. దీనిపై నిర్ణయాన్ని సిబిఐ కోర్టు ఈ నెల 17కి వాయిదా వేసింది.
12:00 గంటలకు ముందు
ఈడీ కేసులో వ్యక్తిగత హజరు నుండి మినహాయింపు ఇవ్వాలని ఏపి సిఎం జగన్ సిబిఐ ప్రత్యేక కోర్టుకు విన్నవించుకున్నారు. గతంలోనూ కూడా జగన్ ఇదే మాదిరిగా అభ్యర్థించగా కోర్టు తోసిపుచ్చింది. అయితే అప్పుడు తన తరపున న్యాయవాది హజరు అవుతారని కోరిన అభ్యర్థనను కోర్టు తోసి పుచ్చింది. ఇప్పుడు తన తరపున సహ నిందితుడు హజరు అవుతారనీ, తనకు వ్యక్తిగత మినహాయింపు ఇవ్వాలని జగన్ కోరుతున్నారు. ఈ మేరకు జగన్ న్యాయవాది కోర్టును అభ్యర్థించారు.
ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ ద్వారా కేసు విచారణ జరుగుతోంది. ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్కు న్యాయమూర్తి ఆదేశించినందున కేసుకు సంబంధం లేని ఇతరులను, మీడియా ప్రతినిధులను కోర్టు హాలులోకి అనుమతించలేదు.
కేసు విచారణ నేపథ్యంలో ఏపి సిఎం జగన్ నాంపల్లి గగన్ విహార్లోని ప్రత్యేక న్యాయస్థానానికి హజరయ్యారు. గన్నవరం నుండి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న సిఎం నేరుగా నాంపల్లిలోని కోర్టుకు చేరుకున్నారు.