(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
ఏపి ముఖ్యమంత్రి వైఎస్ వైఎస్ జగన్మోహనరెడ్డి మూడు రాజధానుల అంశంపై మరో మారు క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే సిఆర్డిఏ రద్దు, పరిపాలనా వికేంద్రీకరణ బిల్లులను గవర్నర్ ఆమోదం పొందగా, ప్రస్తుతం ఈ వ్యవహారం హైకోర్టు విచారణలో ఉన్న తారణంగా విశాఖకు పరిపాలనా రాజధాని తరలింపు ప్రక్రియ తాత్కాలికంగా ఆగిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మూడు రాజధానులు ఏర్పాటు ఎందుకు చేయాల్సి వస్తుంది? అమరావతిలో ఎందుకు కొనసాగించదలుచుకోలేదు? తదితర విషయాలపై జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సిఎం జగన్మోహనరెడ్డి వెల్లడించారు.
పెట్టుబడులు అన్నీ ఒకే ప్రాంతంలో కేంద్రీకృతం కాకూడదు. అలా చేస్తే ఒకే ప్రాంతంలో అభివృద్ధి చెందుతుందని జగన్మోహనరెడ్డి పేర్కొన్నారు. చెన్నై, హైదరాబాద్ ద్వారా ఇప్పటికే నష్టపోయిన విషయం చరిత్ర చెబుతోందన్నారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని జస్టిస్ శివరామకృష్ణయ్య కమిటీ చెప్పిన విధంగా అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసమే మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నామని మరో మారు స్పష్టం చేశారు జగన్మోహనరెడ్డి. 1990లో హైదరాబాద్లో జరిగిన ఇన్ సైడర్ ట్రేడింగ్ మాదిరిగానే అమరావతిలోనూ ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందనీ, వాటిపై సిట్ దర్యాప్తు కొనసాగుతోందనీ చెప్పారు. ఈ దర్యాప్తులో బినామీలంతా బయటపడటం ఖాయమని జగన్ పేర్కొన్నారు.
రాజధాని కోసం వేల ఎకరాలు, లక్షల కోట్లు అవసరం లేదనీ పేర్కొంటూ ఒకటి రెండు మినహాయిస్తే ప్రపంచంలో ఎక్కడా కూడా గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్ సిటీలు సఫలం కాలేదని అన్నారు జగన్. సచివాలయం, హైకోర్టు, అసెంబ్లీ వల్ల అభివృద్ధి జరగని భావిస్తున్న వాళ్ళు అమరావతిలోనే ఇవన్నీ ఉండాలని ఎందుకు పట్టుబడుతున్నారని జగన్ ప్రశ్నించారు. గత ప్రభుత్వ లెక్కల ప్రకారమే అమరావతిలో రాజధాని నిర్మాణాలు చేయాలంటే లక్ష కోట్లు ఖర్చు అవుతుందనీ, ఆ ప్రాంతం కూడా భారీ నిర్మాణాలకు అనువైనదీ కాదనీ అన్నారు సిఎం జగన్.
రాజధాని నిర్మాణానికి 500 ఎకరాలు చాలని శివరామకృష్ణయ్య కమిటీ నివేదికలో పేర్కొంటే..చంద్రబాబు 33 వేల ఎకరాలు ఎందుకు సేకరించారనీ జగన్ ప్రశ్నించారు. అభివృద్ధి వికేంద్రీకరణను అమరావతి ప్రాంత 29 గ్రామాలలోని పదివేల మంది రైతులు మాత్రమే వ్యక్తిగత కారణాల వల్ల వ్యతిరేకిస్తున్నారనీ, రాష్ట్ర ప్రజలు అందరూ వికేంద్రీకరణను స్వాగతిస్తున్నారనీ పేర్కొన్నారు వైఎస్ జగన్.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?