అమరావతి:ప్రజావేదిక నిర్మాణంపై సిఎం జగన్మోహనరెడ్డి సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. ఈ భవనాన్ని కూల్చివేయండి అని జగన్ అధికారులను ఆదేశించారు.
నిబంధనలకు విరుద్ధంగా ఈ ప్రజావేదికను నిర్మించారని జగన్ అన్నారు. ఈ రెండు రోజుల సమీక్షా సమావేశాలు పూర్తి అయిన వెంటనే భవనాన్ని కూల్చివేయాలని జగన్ ఆదేశించారు. ప్రజావేదిక నిర్మాణంలో గత ప్రభుత్వం పూర్తిగా నిబంధనలు ఉల్లంఘించిందని జగన్ పేర్కొన్నారు. అక్రమ నిర్మాణ భవనంలో మనం సమీక్ష జరుపుకుంటున్నామని జగన్ అన్నారు. ఈ విషయం మీ అందరికీ తెలియడం కోసమే ఇక్కడ సమావేశాన్ని పెట్టామని జగన్ తెలిపారు.
ప్రజావేదికపై జగన్ ఎమన్నారో ఒక సారి ఈ కింద వీడియో చూడండి..