అమరావతి: వైసిపి అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ నిర్వహించిన శ్రీ మహారుద్ర సహిత ద్విసహస్ర చండీయాగం నేటితో ముగిసింది. తాడేపల్లిలో 23నెలలుగా నిర్వహిస్తున్న యాగం నేడు పూర్ణాహుతితో సంపూర్ణమైంది. ఈ కార్యక్రమంలో జగన్మోహనరెడ్డి హజరై పండిత ఆశీర్వచనాలు అందుకున్నారు. ఈ సందర్భంగా పండితులకు జగన్ శాలువాలు కప్పి, కంకణం తొడిగి ఘనంగా సత్కరించారు.
సార్వత్రిక ఎన్నికల్లో వైసిపి ఘన విజయం సాధించి వైఎస్ జగన్మోహనరెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని కోరుతూ 2017 జులై 29నుండి గత నెల 29వ తేదీ వరకూ ఈ చండీయాగాన్ని నిర్వహించారు.
రుద్రయాగ దీక్ష పరిపూర్ణమైన సందర్భంగా సోమవారం పూర్ణాహుతి కార్యక్రమం జరిగింది.