NewsOrbit
టాప్ స్టోరీస్

రేషన్ వ్యవస్థకు మంగళం

అమరావతి:ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో తనదైన మద్ర వేసుకునే క్రమంలో భాగంగా రేషన్ వ్యవస్థలో సమూలమైన మార్పులకు శ్రీకారం చుడుతున్నారు.  అవినీతి తావులేని విధంగా పథకాలు, సంక్షేమ ఫలాలు ప్రజలకు అందించాలన్న లక్ష్యంతో గ్రామ వాలంటీర్ వ్యవస్థను తీసుకు వస్తున్నారు.

అమరావతి వేదికగా సాగుతోన్న కలెక్టర్ల సదస్సులో  ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఈ కీలక నిర్ణయాలను ప్రకటించారు.

ప్రభుత్వం అందజేసే రేషన్‌ సరుకులను నేరుగా లబ్దిదారులకు గ్రామ వలంటీర్లే అందజేయనున్నారని సీఎం ప్రకటించారు. ప్రజా పంపిణీ వ్యవస్థలో ఇకపై రేషన్‌ డీలర్లు ఉండబోరని జగన్‌ వెల్లడించారు.

వాలంటీర్లే సరకులను ఇంటింటికీ పంపిణీ చేస్తారనే అంశంపై చర్చ సందర్భంగా రేషన్‌ డీలర్ల ప్రస్తావన వచ్చిన సమయంలో సీఎం పైవిధంగా స్పందించినట్లు తెలుస్తోంది.

తెల్ల రేషన్ కార్డుదారులకు సెప్టెంబరు ఒకటి నుంచి సన్న బియ్యాన్నే పంపిణీ చేయాలని అధికారులకు జగన్ ఆదేశించారు.

దీనికోసం పౌర సరఫరాల శాఖ రూపొందించిన ప్రతిపాదనలు, కలెక్టర్ల నుంచి తీసుకునే సహకారం తదితర అంశాలపై ఆ శాఖ కమిషనర్‌ కోన శశిధర్‌ తెలియజేశారు. ప్యాకింగ్‌ యూనిట్ల ఏర్పాటు, గొడౌన్లు సంబంధిత వివరాలను పౌరసరఫరాల సంస్థ ఎండి సూర్యకుమారి వివరించారు.

తినగలిగే బియ్యాన్ని, అదీ ప్యాకింగ్ రూపంలో ఇచ్చే ప్రక్రియ రెండు విడతల్లో రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని ఉన్నతాధికారులు ప్రతిపాదించారు.

ప్యాకింగ్‌ యూనిట్లు, నిల్వ కేంద్రాల ఏర్పాటు కొలిక్కి వచ్చిన జిల్లాల్లో తొలి విడతలో, మిగితా చోట్ల రెండో విడతలో ఈ విధానాన్ని అమల్లోకి తీసుకురానున్నారు.

ప్రస్తుతం పౌర సరఫరాల శాఖ వద్ద అందుబాటులో ఉన్న బియ్యంలోనే నాణ్యమైన రకాన్ని వేరుచేసి, తొలి విడత జిల్లాల్లో పంపిణీ చేయనున్నారు.

తర్వాత నుంచి ధాన్యం సేకరణ సమయంలోనే కొన్ని రకాలను వేరుచేసి వీటిని సేకరించనున్నారు.
జిల్లాల్లో ఇప్పటికే ఆటోమేటిక్‌ ప్యాకింగ్‌ యూనిట్లు అందుబాటులో ఉంటే వారికి పని అప్పగించేలా ఏర్పాట్లు చేయాలని, అదనంగా నిల్వ కేంద్రాలను సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు.

వాలంటీర్ల ధ్రువీకరణ కోసం పంచాయతీరాజ్‌, పాఠశాల విద్యాశాఖలో అమలుచేస్తున్న విధానాలను పరిశీలించి అమలు చేయాలనీ, తినగలిగే రకం ధాన్యాన్ని పండించే దిశగా రైతుల్ని ప్రోత్సహించాలని సిఎం తెలిపారు.

ఖరీఫ్‌లో 1.31లక్షల హెక్టార్లు, రబీలో 3.15లక్షల హెక్టార్లలో ఇలాంటి రకం ధాన్యాన్ని పండించేలా రైతుల్లో మార్పు తీసుకురావాలన్నారు. పంట చేతికొచ్చే సమయంలో సకాలంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, అపుడే మంచి రకాన్ని వేరు చేయాలని సూచించారు.

నిల్వ కేంద్రాల నుంచి వలంటీర్లు రేషన్ సరుకులను బయోమెట్రిక్‌ ధ్రువీకరణతో తీసుకుంటారు.లబ్ధిదారుల ఇంటికి తీసుకువెళ్లి వారితోనూ బయోమెట్రిక్‌ పరికరంపై ధ్రువీకరణ తీసుకున్నాకే సరకుల్ని అందజేస్తారు. లబ్ధిదారుడి వేలిముద్ర సరిగా పడకపోతే వారి ఆధార్‌ నెంబరు ఆధారంగా సరకులను ఇవ్వనున్నారు. ఆయితే రేషన్ డీలర్ ల వ్యవస్థను నూతన సిఎం రద్దు చేయనుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం కొనసాగుతున్న సుమారు 30వేల మంది రేషన్ డీలర్లలో  ఆందోళన నెలకొన్నది.

ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం పునఃసమీక్షించాలని రేషన్ డీలర్ల రాష్ట్ర సంఘం కోరుతోంది. తమకు న్యాయం చేయాలని కోరుతూ శుక్రవారం అన్ని జిల్లా కేంద్రాలలో శాంతియుతంగా మౌన ప్రదర్శనలు నిర్వహించేందుకు సంఘ నేతలు పిలుపు నిచ్చారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Ayodhya : జ‌న‌వ‌రి 22 : అయోధ్య రామ‌మందిరం ఓపెనింగ్‌.. మీ గ్రామాల్లో ఈ ప‌నులు చేయండి..!

Saranya Koduri

Subrata Roy: సుబ్రతా రాయ్ ఇక లేరు…సహారా గ్రూప్ స్థాపకుడుకి 75 సంవత్సరాలు, దీర్ఘకాలిక అనారోగ్యం తో కన్ను మూత.

Deepak Rajula

International Girl Child Day: అంతర్జాతీయ బాలికా దినోత్సవంపై స్పెషల్ స్టోరీ.. 2023 థీమ్ ఏంటి? దీని చరిత్ర..

siddhu

Amaravati Capital Case: అమరావతి రాజధాని కేసు డిసెంబర్ కు వాయిదా వేసిన సుప్రీం కోర్టు .. ఏపీ సర్కార్ కు షాక్ | Supreme Court Shocks AP Govt in Amaravti Case 

sharma somaraju

Kuno National Park: కునో నేషనల్ పార్కుకు మరో 12 చిరుతలు.. ఈ పార్కుకు వెళ్లాలని అనుకుంటున్నారా? హైదరాబాద్, విజయవాడ నుంచి ఇలా వెళ్లండి!

Raamanjaneya

Mughal Gardens: అమృత ఉద్యాన్‌గా మొఘల్ గార్డెన్.. దీని చరిత్ర.. ప్రత్యేకతలు!

Raamanjaneya

థార్ డెసర్ట్‌లో ఇసుక తిన్నెలు నడుమ అద్భుతమైన ఆహారం,  ప్రదర్శనలు, కచేరీలు!

Raamanjaneya

KCR’s BRS: నూతన శాతవాహన సామ్రాజ్యం దిశగా పావులు కదుపుతున్న నయా శాతవాహనుడు సీఎం కేసీఆర్

sharma somaraju

ఆ ఇద్దరూ ఒకే వేదికపై ..! బీజేపీ భారీ ప్లాన్స్, సక్సెస్ అవుతాయా..!?

Special Bureau

Why Lawrence Bishnoi wants Salman Khan Dead? నాలుగు సంవత్సరాల నుండి సల్మాన్ నీ చంపడానికి ప్లాన్ చేస్తున్న దుండగులు..!!

Siva Prasad

PK Team: పీకే టీమ్ – 1500మంది రెడీ ..! వైసీపీ కోసం భారీ ప్లాన్స్..!

Special Bureau

YSRCP: ఈ విషయాలు గమనిస్తే దటీజ్ జగన్ అనాల్సిందే(గా)..?

sharma somaraju

Rahul Gandhi: వరంగల్ సభలో టీఆర్ఎస్ పై రాహుల్ సీరియస్ కామెంట్లు..!!

sekhar

Telangana Crime: భాగ్యనగరంలో అమానవీయ ఘటన! పదహారు మంది బాలల బట్టలూడదీసి కొట్టినా కిమ్మనని పోలీసులు,కెసిఆర్ సర్కారు!

Yandamuri

TDP ChandraBabu: కార్యకర్తలపై కేసులు.. బాబోరీ వెరైటీ కూతలు..!!

sekhar

Leave a Comment