అమరావతి: గత ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి తగు చర్యలు చేపట్టేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో విద్యుత్ రంగ సమీక్షా సమావేశం నిర్వహించారు.
సోలార్, విండ్ పవర్ కొనుగోళ్లపై అధికారులతో విస్తృతంగా చర్చించారు.
కాంపిటేటివ్ బిడ్డింగ్ రేట్ల కన్నా అధిక రేట్లకు ఎందుకు కొనుగోలు చేయాల్సి వచ్చిందని జగన్ ప్రశ్నించారు. ప్రభుత్వ ఖజానాకు 2636కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందనీ, ఈ డబ్బును రికవరీ చేయాలని సిఎం ఆదేశించారు.
కంపెనీలతో తిరిగి సంప్రదింపులు చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు జగన్ తెలిపారు.
సోలార్, విండ్ కంపెనీలు దారికి రాకుంటే వారితో ఒప్పందాలు రద్దు చేయాలని జగన్ సూచించారు. సోలార్, విండ్ కంపెనీలతో జరిగిన ఒప్పందాలలో భారీ దోపిడీ జరిగినట్లు స్పష్టమైందని అన్నారు. ఈ వ్యవహారంలో ఎంతటి వారు ఉన్నా వదిలిపెట్టవద్దని జగన్ అన్నారు. విద్యుత్తు ఒప్పందాలలో జరిగిన దోపిడీని రికవరీ చేయాలని జగన్ సూచించారు.