అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి పార్లమెంటరీ వ్యవహారాల శాఖ నిర్వహిస్తున్న అఖిలపక్షసమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీ బయలు దేరి వెళ్లారు. ఈ సమావేశానికి వెల్లకూడదని నిర్ణయించుకున్న టిడిపి అధినేత చంద్రబాబు కుటుంబ సమేతంగా యూరప్ పర్యటనకు బయలుదేరారు.
చంద్రబాబు నిన్న అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే హైదరాబాదు వెళ్లారు. అక్కడ నుండి నేటి ఉదయం యూరప్ పర్యటనకు సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేష్, కోడలు బ్రహ్మణి, మనుమడు దేవాన్ష్లతో కలిసి బయలు దేరారు.
డిల్లీ నేడు ప్రధాన మంత్రి నరేంద్ర మోది నేతృత్వంలో జరిగే సమావేశానికి పార్లమెంట్లో ప్రాతినిధ్యం ఉన్న వివిధ రాజకీయ పార్టీల అధ్యక్షులను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ఆహ్వానించారు. జమిలి ఎన్నికల నిర్వహణపై పార్టీ అధ్యక్షులు అభిప్రాయాలను తెలుసుకునేందుకు ఈ సమావేశాన్ని ఎర్పాటు చేశారు. తన అభిప్రాయాలను నేరుగా వెల్లడించేందుకు వైసిపి అధినేత, సిఎం వైఎస్ జగన్మోహనరెడ్డి సమావేశానికి వెళ్లగా, టిడిపి అధినేత చంద్రబాబు మాత్రం ఈ అంశాలకు సంబంధించి తన అభిప్రాయాలను తెలియజేస్తూ లేఖ రాసారు. ఈ లేఖను టిడిపి పార్లమెంటరీ పార్టీ నాయకులు బుధవారం ఢిల్లీలో అందజేయనున్నారు.
కాగా కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ సమావేశానికి హజరుకావడం లేదు. ఆయన తరుపున టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పాల్గొంటున్నట్లు సమాాచారం.
నేటి మధ్యాహ్నం మూడు గంటల నుండి ఐదున్నర గంటల వరకూ పార్లమెంట్ లైబ్రరీ హాలులో ఈ సమావేశం జరగనుంది.