(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
అమరావతి: జిల్లాల కలెక్టర్లు, ఎస్పిలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేస్తున్నారు. మంగళవారం తాను ఇచ్చే విందుకు హజరుకావాలని కలెక్టర్, ఎస్పిలకు ఆహ్వానాలు పంపారు. విందు కార్యక్రమంలో జిల్లాకో టేబుల్ చొప్పున 13 జిల్లాలకు 13 టేబుళ్లు ఏర్పాటు చేస్తుండగా ఒక్కో టేబుల్ వద్ద సిఎం జగన్ కనీసం పది నిమిషాల పాటు గడుపుతారని సమాచారం.
ఈ సందర్భంలో జిల్లాల పరిస్థితులు, సమస్యల గురించి అధికారులతో కలెక్టర్, ఎస్పిలతో ముఖాముఖి నిర్వహించి పెండింగ్ సమస్యల పరిష్కార మార్గాలపై సలహాలు స్వీకరస్తారని తెలుస్తోంది. ఈ విందులో సంప్రదాయ ఆంధ్రా వంటకాలతో పాటు నార్త్, సౌత్ ఇండియన్ వంటలను వడ్డిస్తారని సమాచారం. ఈ విందుకు వైసిపి ఎమ్మెల్యేలతో పాటు వివిధ విభాగాల పోలీస్ కమిషనర్లు కూడా హజరుకానున్నారు.