అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు నివాసంపై డ్రోన్ ఎగరడంలో ఎటువంటి కుట్ర లేదని డిజిపి గౌతమ్ సవాంగ్ స్పష్టం చేశారు. చంద్రబాబు నివాసంపై డ్రోన్ ఎగరడంపై టిడిపి నేతలు వైసిపి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న నేపథ్యంలో డిజిపి సవాంగ్ వివరణ ఇచ్చారు. వరదల కారణంగా అంచనా కోసం నీటి పారుదల శాఖ డ్రోన్ ఉపయోగించిందని ఆయన స్పష్టం చేశారు. స్థానిక పోలీసులకు సమాచారం లేకపోవడంతో కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చిందని ఆయన అన్నారు. ఇందులో ఎటువంటి కుట్ర లేదని స్పష్టం చేశారు. దీనిని రాజకీయం చేయవద్దని సవాంగ్ సూచించారు. ఇకపై ఎవరైనా డ్రోన్ వినియోగించాలంటే స్థానిక పోలీసుల అనుమతి తప్పనిసరి ఆయన చెప్పారు. నీటి పారుదల శాఖ, స్థానిక పోలీసుల మధ్య సమన్వయలోపం కారణంగానే ఈ వివాదం నెలకొందని సవాంగ్ పేర్కొన్నారు.