అమరావతి : టీడీపీ అధినేత చంద్రబాబు భద్రతను తగ్గించారంటూ ఆ పార్టీ నాయకులు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఏపీ డీజీపీ కార్యాలయం దీనిపై క్లారిటీ ఇచ్చింది. చంద్రబాబుకు కల్పిస్తున్న భద్రతలో ఎలాంటి మార్పు జరగలేదనీ, దేశంలోనే అత్యంత హై సెక్యూరిటీని చంద్రబాబుకు కల్పిస్తున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం ఆయనకు జడ్ ప్లస్ సెక్యూరిటీతో భద్రత కల్పిస్తున్నామనీ, సెక్యూరిటీ రివ్యూ కమిటీ నిర్ణయం మేరకు భద్రతలో మార్పులు, చేర్పులు చేశామనీ తెలిపింది. ప్రస్తుతం చంద్రబాబుకు 183 మంది భద్రతా సిబ్బందితో భద్రత కల్పిస్తున్నామని తెలియచేసింది. చంద్రబాబు విజయవాడలో ఉన్నపుడు ఆయనకు 135 మంది రక్షణగా ఉంటారనీ, హైదరాబాద్లో ఉన్నపుడు 48 మందితో భద్రత చేపట్టామనీ డీజీపీ కార్యాలయం వివరణ ఇచ్చింది.
previous post