(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: రాజ్భవన్లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆధ్యర్యంలో ఎట్ హోం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి, స్పీకర్ తమ్మినేని సీతారాం, మండలి చైర్మన్ షరీఫ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డిజిపి గౌతం సవాంగ్, మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంధ్రనాధ్ రెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు తదితర ప్రముఖులు, ఉన్నతాధికారులు హాజరైయారు.
ఈ కార్యక్రమానికి టిడిపి అధినేత చంద్రబాబు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. గణతంత్ర దినోత్సవాన్ని పురష్కరించుకుని ప్రతి ఏడాది రాజ్భవన్లో ఎట్ హోం కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఏపీలో మొదటిసారి ఎట్ హోం నిర్వహిస్తున్నారు.
తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్గా నరసింహన్ ఉన్నప్పుడు హైదరాబాద్లోని రాజ్భవన్లో ఎట్ హోం నిర్వహించేవారు. ఏపీకి విశ్వభూషణ్ హరిచందన్ గవర్నర్గా నియమితులైన తరువాత విజయవాడలోని రాజ్భవన్లో తొలిసారి ఎట్ హోం నిర్వహించారు. దాదాపు 600 మంది అతిథులకు సరిపడేలా ఏర్పాట్లు జరిగాయి. రాజ్భవన్ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, పలువురు ఉన్నతాధికారులు ఎట్ హోమ్ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు. మొదటిసారి జరుగుతున్న ఈ కార్యక్రమానికి ప్రభుత్వం కట్టదిట్టమైన భద్రతా ఏర్పాటు చేసింది.