(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
అమరావతి: ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధి ప్రణాళికకై ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి నేతృత్వంలో 16 మంది సభ్యులతో హైపవర్ కమిటీని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కమిటీ కన్వీనర్గా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహాని, సభ్యులుగా మంత్రులు పేర్ని నాని, మోపిదేవి వెంకటరమణ, మేకపాటి సుచరిత, బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్, కె కన్నబాబు, కొడాలి నాని, పిల్లి సుభాష్ చంద్రబోస్, గౌతమ్ రెడ్డి, ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు అజయ్ కల్లం, డిజిపి గౌతమ్ సవాంగ్తో సహా పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు.
రాజదానిపై జిఎన్ రావు కమిటీ, బోస్టన్ కమిటీ నివేదికలను ఈ హైపవర్ కమిటీ అధ్యయనం చేసి మూడు వారాల్లో నివేదిక అందజేయాలని ప్రభుత్వం ఆదేశించింది.