అమరావతి: ఇద్దరు వ్యక్తుల మిస్సింగ్ కేసుకు సంబంధించి రెండు రోజుల్లో ధర్మాసనం ముందు హాజరు కావాలని ఎపి డీజీపీ గౌతమ్ సవాంగ్ కు హైకోర్టు ఆదేశించింది.
ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన రెడ్డి గౌతమ్, ఎల్లేటి లోచిని అనే ఇద్దరు వ్యక్తులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారంటూ గతంలో హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటీషన్ దాఖలైంది. ఆ పిటిషన్ ను విచారించిన హైకోర్టు ధర్మాసనం జ్యూడిషియల్ విచారణకు ఆదేశాలిచ్చింది. విచారణాధికారిగా విశాఖపట్నం సీనియర్ సివిల్ జడ్జిని నియమించారు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు విశాఖ సీనియర్ సివిల్ జడ్జి న్యాయ విచారణ పూర్తి చేసి నివేదికను హైకోర్టుకు అందజేశారు.
ఆ నివేదికను పరిశీలించిన హైకోర్టు ధర్మాసనం.. నివేదిక అంశాల ఆధారంగా ఏపీ డీజీపీ గౌతమ్ సావంగ్ను ఫిబ్రవరి 14వ తేదీన ధర్మాసనం ఎదుట హాజరు కావాలనీ, సంబంధిత వివరాలతో వివరణ ఇచ్చేందుకు సిద్ధం కావాలనీ బుధవారం ఆదేశాలు జారీ చేసింది..