NewsOrbit
టాప్ స్టోరీస్ న్యూస్

హైకోర్టు కీలక తీర్పు..! సమాచార శాఖకు డీజీపీ లేఖ..!!

 

(అమరావతి నుండి న్యూస్ ఆర్బిట్ ప్రతినిధి)

మాజీ అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్‌పై ఎసిబి కేసు నమోదు చేసిన విషయంలో అనేక మలుపులు చోటుచేసుకుంటున్నాయి. ఆయనపై నమోదు చేసిన కేసు వివరాలు నిన్న మధ్యాహ్నం పత్రికా ప్రకటన రూపంలో మీడియాకు వచ్చాయి. దీనితో సోషల్ మీడియా, వెబ్ మీడియాలలో ఆ వార్తలు ప్రధానంగా ప్రచురితం అయ్యయి. ‌దీనితో స్పందించిన దమ్మాలపాటి శ్రీనివాస్ తనపై కేసు అక్రమంగా పెట్టారనీ, తనను అన్యాయంగా ఇరికిస్తున్నారనీ, తనకు సంబంధంలేని విషయాల్లో తనను లాగుతున్నారనీ పేర్కొంటూ తనపై ఎసిబి విచారణ జరగకుండా స్టే ఇవ్వాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. దానితో పాటు తనపై ఎటువంటి మీడియా వెబ్ మీడియా, సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా, ఎటువంటి మీడియా విభాగాల్లోనూ ఆ కేసుకు సంబంధించి వార్తలు రాకుండా ఉండే విధంగా తీర్పు ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించారు. అత్యవసర పిటిషన్‌గా దీన్ని విచారణకు స్వీకరించిన హైకోర్టు నిన్న రాత్రి తదుపరి చర్యలు నిలిపివేయాలని స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చింది. ఎఫ్ఐఆర్‌లోని సమచారాన్ని ప్రసార మాధ్యమాల్లో ప్రసారం చేయకూడదంటూ హైకోర్టు ఆదేశించింది. దమ్మాలపాటి శ్రీనివాస్ తరపున సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్గీ, శ్యాందివాన్‌లు వాదనలు వినిపించారు. దమ్మాలపాటిని ఇరికించేందుకు ఉద్దేశపూర్వకంగానే అభియోగాలు మోపారని అధారలతో సహా హైకోర్టుకు పిటిషనర్ తరపు న్యాయవాదులు వివరించడంతో హైకోర్టు వారి వాదనలతో ఏకీభవించి ఈ తీర్పు ఇచ్చింది. దీని పర్యవసానాల నేపథ్యంలో..

సమాచార శాఖకు లేఖ రాసిన డీజీపీ

హైకోర్టు తీర్పు నేపథ్యంలో పోలీస్ శాఖ అప్రమత్తం అయ్యింది. దమ్మాలపాటి శ్రీనివాస్‌పై ఎసిబి కేసు విషయంలో ఎటువంటి వార్తలు రాకుండా ఆదేశాలు ఇవ్వాలని పేర్కొంటూ సమాచార శాఖకు డీజీపి గౌతమ్ సవాంగ్ లేఖ రాశారు. ఆ లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.  ప్రింట్, సోషల్ మీడియా ఏ విభాగాల్లోనూ ఎసిబి కేసుకు సంబంధించి వివరాలు రాకూడదని, దమ్మాలపాటి శ్రీనివాస్ కేసు విషయమై ఏటువంటి వార్తలు రాయకూడదని పేర్కొంటూ ఆయన లేఖలో పేర్కొన్నారు. మొత్తానికి నిన్న మధ్యాహ్నం ఎసిబి కేసు నమోదు విషయం బయటకు రావడం, పేర్లు అన్ని బయటకు రావడం, నిన్న రాత్రే శ్రీనివాస్ హైకోర్టును ఆశ్రయించడం, వెంటనే హైకోర్టు విచారణకు స్వీకరించి తీర్పు ఇవ్వడం, తీర్పు నేపథ్యంలో పక్కాగా అమలు చేసేందుకు డీజీపీ సమాచార శాఖకు లేఖ రాయడం ఇదంతా గంటల వ్యవధిలోనే జరిగిపోవడం ఏపిలో కొత్త విషయాన్ని సృష్టించినట్లు అయ్యింది.

 

 

author avatar
Special Bureau

Related posts

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk

Lok sabha Elections 2024: నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల .. ఏపీ, తెలంగాణలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం

sharma somaraju

వైసీపీలో ఆ ఇద్ద‌రి సీట్లు పీకేస్తోన్న జ‌గ‌న్‌… రోజా బ్యాడ్ ల‌క్ అంతే..?

BSV Newsorbit Politics Desk

Nabha Natesh: మాట‌లు జాగ్ర‌త్త‌.. ప్రియ‌ద‌ర్శికి న‌భా న‌టేష్ స్ట్రోంగ్ వార్నింగ్.. అంత పెద్ద తప్పు ఏం చేశాడు?

kavya N

మాకు బీ ఫామ్‌లు వ‌ద్దు… ప‌వ‌న్‌ను చివ‌రి వ‌ర‌కు టెన్ష‌న్ పెట్టిన జ‌న‌సేన క్యాండెట్లు…!

Nuvvu Nenu Prema April 18 2024 Episode 601: విక్కీని కొట్టి పద్మావతిని కిడ్నాప్ చేసిన కృష్ణ.. అనుతో దివ్య గొడవ.. పద్మావతిని శాశ్వతంగా దూరం చేసిన కృష్ణ..

bharani jella

AP Elections 2024: రేపటి నుండి నామినేషన్లకు రంగం సిద్దం – సీఈవో ముకేశ్ కుమార్ మీనా

sharma somaraju