అమరావతి: ప్రాధమిక పాఠశాల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడుతూ ప్రభుత్వం జారీ చేసిన జివోని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. బిజెపి నేత సురేష్ రాంభొట్ల, డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ ఈ పిటిషన్లు వేశారు.
జివో అమలు నిలిపివేయాలనీ, మీడియం ఎంపిక చేసుకునే హక్కు తల్లిదండ్రులకు, విద్యార్థులకు ఇవ్వాలనీ ఆ పిటిషన్లో కోరారు. పిటిషన్ను విచారణ స్వీకరించిన హైకోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకూ ఇంగ్లీషు మాధ్యమం పుస్తకాలను ప్రింట్ చేయవద్దని హైకోర్టు ఆదేశించింది. ఒక వేళ ప్రింట్ చేస్తే ఆ ఖర్చును అధికారుల నుండి వసూలు చేస్తామని హెచ్చరిస్తూ తదుపరి విచారణ జనవరి 27వ తేదీకి వాయిదా వేసింది.