అమరావతి: ఏపి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు డిసెంబర్ తొమ్మిదవ తేదీ నుండి నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తున్నది. ఈ సమావేశాలు పది నుండి 15 రోజుల పాటు జరిగే అవకాశం ఉందని సమాచారం. ఇందు కోసం అసెంబ్లీ యంత్రాంగం అయిదు రోజుల ముందే ఏర్పాట్లు చేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ప్రాంగణంలో వైసిపి ఎల్పి కార్యాలయంలో వైసిపి నేతలు, చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి, విప్లు మల్లాది విష్ణు, సామినేని ఉదయభాను, జోగి రమేష్, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో అసెంబ్లీ శీతాకాల సమావేశాల గురించి చర్చించినట్లు సమాచారం. అనంతరం స్పీకర్ తమ్మినేని సీతారాంను కలిసి చర్చించినట్లు తెలుస్తున్నది.