(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: టిడిపి ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ రాజీనామా చేశారు. మూడు రాజధానుల బిల్లులు మండలిలో చర్చకు వచ్చిన తరుణంలో ఆయన రాజీనామా చేయడం సంచలనంగా మారింది. ఆయన తన రాజీనామా లేఖను టిడిపి అధినేత చంద్రబాబుకు పంపారు. ఆయన మంగళవారం మండలికి రాలేదు.
మాణిక్య వరప్రసాద్ రాజీనామాపై శాసనమండలి లాబీల్లో విస్తృతంగా ఊహాగానాలు సాగుతున్నాయి. అధికారపక్షం నుంచి వత్తిడి వచ్చి ఉంటుందని ఎక్కువమంది అభిప్రాయపడుతున్నారు. అయితే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు మాణిక్య వరప్రసాద్ పంపిన లేఖలో ఆయన వెలిబుచ్చిన మనోభావాలు భిన్నంగా ఉన్నాయి.
అందులో ఆయన తాను రాజధానిగా అమరావతి కొనసాగింపునకే కట్టుబడి ఉన్నాననీ, మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నాననీ రాశారు. రాజధాని తరలింపు యత్నాలతో మనస్తాపం చెంది ఆయన రాజీనామా లేఖ పంపారని కూడా అంటున్నారు. మరో టిడిపి సభ్యురాలు శమంతకమణి కూడా మంగళవారం మండలికి గైరుహాజరయ్యారు. బిజెపి ఎమ్మెల్సీ మాధవ్ కూడా గైరుహాజరయ్యారు.