(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
వంద వార్తల కన్నా ఒక కార్టూన్ ప్రభావవంతంగా విషయం వివరించగలదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులకు అద్దం పట్టే కార్టూన్ ఒకటి ద హిందూ ఇంగ్లీష్ దినపత్రికలో శుక్రవారం వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చీ రావడంతోనే ఇసుక ఊబిలో చిక్కుకున్నారు. తెలంగాణలో రెండవసారి అధికారం చేపట్టిన కెసిఆర్ ఆర్టీసీ కార్మికుల సమ్మె పట్ల కన్నెర్ర చేసి విమర్శలను ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితులను ప్రతిబింబిస్తూ ద హిందూ కార్టూనిస్ట్ సురేంద్ర చక్కటి కార్టూన్ వేశారు.