అమరావతి: ఇసుక వారోత్సవాలు అని సిఎం జగన్ ప్రకటిస్తే ప్రజలకి ఇసుక అందుబాటులోకి తీసుకొస్తారనుకుని పొరపాటు పడ్డానని టిడిపి ఎమ్మెల్సీ నారా లోకేష్ అన్నారు. ఇసుక క్వారీల వద్ద వైసిపి శ్రేణులు కొట్టుకోవడంపై ఆయన ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ జగన్ ప్రభుత్వాన్ని వ్యంగ్యంగా విమర్శించారు.
‘జగన్ గారు అన్నది ఇసుక ‘వార్’ ఉత్సవాలు అని తరువాత అర్ధం అయ్యింది’ అని లోకేష్ వ్యాఖ్యానించారు.ఇసుక వార్లో భాగంగా ఇసుక వాటాల కోసం వైసిపి నాయకులు కర్రలతో దాడులు చేసుకొని, తలలు పగులకొట్టుకుంటున్నారని ఆయన అన్నారు. ఇసుక క్వారీ వద్ద కొట్టుకుంటున్న వీడియోను లోకేష్ పోస్టు చేశారు.
ఒక పక్క వైసిపి నాయకులు ఇసుకలో వాటాల కోసం వీధి రౌడీల్లా కొట్టుకుంటుంటే గుంటూరు జిల్లా పెదకాకానిలో జగన్ ప్రభుత్వ చేతగాని పాలనకి మరో భవన నిర్మాణ కార్మికుడు పీట్ల శ్రీను ఆత్మహత్యకు పాల్పడ్డారని అన్నారు.
‘వైసిపి ఇసుక వార్ ఉత్సవాలు, ఇసుక పంచాయతీలు ఆపి కార్మికుల బతుకు భరోసా ఇవ్వండి జగన్ గారు’ అంటూ లోకేష్ ట్వీట్ చేశారు.
ఒక పక్క వైకాపా నాయకులు ఇసుకలో వాటాల కోసం వీధిరౌడీల్లా కొట్టుకుంటుంటే గుంటూరు జిల్లా, పెదకాకానిలో జగన్ గారి చేతగాని పాలనకి మరో భవన నిర్మాణ కార్మికుడు పీట్ల శ్రీను ఆత్మహత్యకు పాల్పడ్డారు.వైకాపా ఇసుక వార్ ఉత్సవాలు, ఇసుక పంచాయితీలు ఆపి కార్మికులకు బతుకుభరోసా ఇవ్వండి జగన్ గారు (2/2)
— Lokesh Nara (@naralokesh) November 25, 2019