నాగార్జునసాగర్: ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు పుష్కలంగా నీరు చేరుకోవడంతో ఆదివారం ఖరీఫ్ ఆయకట్టుకు సాగునీరును విడుదల చేశారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువల నుండి సాగు నీరును తెలంగాణ విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి అనిల్కుమార్ విడుదల చేశారు. సాగునీటి కాలువలకు వెయ్యి క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు.
ప్రస్తుతం నాగార్జునసాగర్కు 7.48లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా 37.49 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 538 అడుగులకు చేరుకుంది.
సాగునీటి విడుదల కార్యక్రమంలో ఏపి, తెలంగాణకు చెందిన పలువురు నేతలు, నీటి పారుదల శాఖ అధికారులు పాల్గొన్నారు.
previous post
next post