ముంబై: నెహ్రూ విధానాల వల్లే పీవోకే భారత్ నుంచి చేజారిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. మహారాష్ట్ర, హర్యానాల్లో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో కేంద్రంలోని అధికార బీజేపీ ప్రచారాన్ని మొదలు పెట్టింది. ఆదివారం మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. ఆర్టికల్ 370 రద్దుపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు అమిత్ షా. `రాహుల్ బాబాకు రాజకీయాలు కొత్త. మొన్నీ మధ్యే ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. మేము.. మూడు తరాల నుంచీ రాజకీయాలు చేస్తున్నాం, రాజకీయాల్లోనే ఉన్నాం. దేశం గురించి, దేశం ఎదుర్కొనే సమస్యాత్మకమైన, సున్నితమైన సమస్యల గురించి ఎవరికి ఎక్కువ అవగాహన ఉంటుంది? జమ్మూ కాశ్మీర్ ను భారత్ నుంచి వేరు చేయడానికి ఉద్దేశించిన ఆర్టికల్ 370ని రద్దు చేయించడానికి బీజేపీ నాయకులు తమ జీవితాలనే పణంగా పెట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. ముందు వాటి గురించి తెలుసుకో’ అంటూ అమిత్ షా వ్యాఖ్యానించారు.
370 के कारण देश में आतंकवाद आया, इसने पाकिस्तान को अलगाववाद भड़काने का साधन दिया।
इसके बाद कश्मीर से कश्मीरी पंडितों, सूफी-संतों को निकाल दिया गया।
1989 से अब तक करीब 40,000 लोग मारे गए और कांग्रेस पूछती है कि 370 को क्यों हटाया: श्री अमित शाह #BJPForUnitedIndia pic.twitter.com/qRlxQZj9Rv
— BJP (@BJP4India) September 22, 2019
ఆర్టికల్ 370 రద్దు తరువాత జమ్మూ కాశ్మీర్.. భారతావనిలో విలీనమైందని అమిత్ షా అన్నారు. ఆర్టికల్ 370ని రద్దు చేయాలనే సాహసోపేత నిర్ణయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ తప్ప మరెవరూ తీసుకోలేరని అన్నారు. కేంద్రంలో తాము రెండోసారి అధికారంలోకి రావడం వల్లే అది సాధ్యపడిందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ఉంటే ఆర్టికల్ 370ని రద్దు చేసేదా? అని ప్రశ్నించారు. జమ్మూ కాశ్మీర్ అంశాన్ని తాము రాజకీయంగా ఎంత మాత్రమూ భావించట్లేదని అన్నారు. మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ రెండోసారి ముఖ్యమంత్రిగా కొనసాగుతారని అమిత్ షా పునరుద్ఘాటించారు.
महाराष्ट्र में एक ओर भारत मां को अपना सर्वस्व मानने वाली पार्टी भाजपा है, तो दूसरी ओर अपने परिवारों को सर्वस्व मानने वाली कांग्रेस और एनसीपी।
महाराष्ट्र की जनता को तय करना है कि उन्हें राष्ट्रवादी पार्टी के साथ जाना है या परिवारवादी पार्टियों के: श्री अमित शाह #BJPForUnitedIndia pic.twitter.com/RtX3o2jdb8
— BJP (@BJP4India) September 22, 2019
మహారాష్ట్ర, హరియాణా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమిషన్ శనివారం షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. మహారాష్ట్రలో 288, హరియాణాలో 90 స్థానాలకు అక్టోబరు 21 పోలింగ్ నిర్వహించి ఫలితాలను అదే నెల 24 వెల్లడించనున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ ప్రచరాన్ని మొదలు పెట్టింది. మహారాష్ట్ర, హర్యానాల్లో పీఠాన్ని నిలుపుకోవడంపై దృష్టి సారించింది. ప్రస్తుతం ఈ రెండు చోట్ల కూడా బీజేపీయే అధికారంలో కొనసాగుతోంది. అధికారాన్ని నిలబెట్టుకోవడానికి బీజేపీ ఎన్నికల ప్రచారాస్త్రాలకు పదును పెడుతోంది. జమ్మూకాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసిన అంశాన్ని ఎన్నికల ప్రధాన ప్రచారాస్త్రంగా మలచుకుంది కాషాయ పార్టీ.