(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: ఈ ఒక్క రోజు శాసనసభ నిర్వహించాలని బిఏసి నిర్ణయించింది. అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన జరిగిన బిఏసి సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి, మంత్రులు బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి, కురసాల కన్నబాబు, అనిల్ కుమార్, చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తొలుతఅసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ప్రారంభమైన వెంటనే ఏపీ కేబినెట్ ఆమోదించిన శాసనమండలి రద్దు తీర్మానాన్ని స్పీకర్ తమ్మినేని సీతారాంకు ప్రభుత్వం అందించింది. అయితే ఈ రద్దు తీర్మానంపై అసెంబ్లీలో చర్చ జరగాలంటే బిఏసి సమావేశం కావాలని స్పీకర్ సూచిస్తూ అసెంబ్లీని వాయిదా వేశారు. అనంతరం జరిగిన బిఏసి సమావేశంలో ఈ రోజు సాయంత్రం వరకూ శాసనసభ నిర్వహించాలని నిర్ణయించారు. నేటి అసెంబ్లీ సమావేశంలో మండలి రద్దుపై సుదీర్ఘంగా చర్చించాలని నిర్ణయించింది. మండలి రద్దుతో పాటు మరికొన్ని బిల్లులను కూడా ప్రవేశపెట్టేందుకు బిఏసి సుముఖత వ్యక్తం చేసింది,