కోల్ కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఆ రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధన్ఖర్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇరువురి మధ్య వివాదం ముదురుతోంది. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ పౌర పట్టిక(ఎన్ఆర్సీ)లను వ్యతిరేకిస్తూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోమవారం మధ్యాహ్నం ఒంటి గంటకు కోల్కతాలో మెగా ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో జనం భారీగా పాల్గొన్నారు.
అంతకు ముందు.. ఈ మెగా ర్యాలీలో పాల్గొనాలని ప్రజలకు మమత పిలపునిచ్చారు. ‘రాజ్యాంగ పరిధిలో శాంతియుతంగా ఈ ప్రజా ఉద్యమంలో పాల్గొందాం. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు కదలి రండి. రాజ్యాంగ విరుద్ధమైన పౌరసత్వ సవరణ చట్టం, ఎన్ఆర్సీలపై కోల్ కతాలో మెగార్యాలీ నిర్వహిస్తున్నాం. ఈ రోజు మధ్యాహ్నం రెడ్ రోడ్ లోని బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహం నుంచి ఈ ర్యాలీ ప్రారంభమై జోరాసంకో ఠాకుర్బారీ వద్ద ముగుస్తుంది’ అని మమతా బెనర్జీ ట్వీట్లు చేశారు.
A mega rally will be held today in #Kolkata to protest against unconstitutional #CABBill & #NRC. It will begin at 1pm near the statue of Babasaheb Ambedkar on Red Road & end at Jorasanko Thakurbari.(1/2)
— Mamata Banerjee (@MamataOfficial) December 16, 2019
అయితే, దీదీ తీరుపై రాష్ట్ర గవర్నర్ జగదీప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘సీఏఏకి వ్యతిరేకంగా సీఎం మమతా ర్యాలీ నిర్వహించడం బాధాకరం. సీఎం తీరు రాజ్యాంగ విరుద్ధం. పార్లమెంటు చట్టాన్ని వ్యతిరేకించడం అంటే రాజ్యాంగాన్ని వ్యతిరేకించడమే. మీరు రాజ్యాంగానికి బద్దులై పనిచేస్తూ శాంతిని కాపాడాలని కోరుతున్నాను’ గవర్నర్ పేర్కొన్నారు.
.@MamataOfficial. I am extremely anguished that CM and Ministers are to spearhead rally against CAA, law of the land. This is unconstitutional. I call upon CM to desist from this unconstitutional and inflammatory act at this juncture and devote to retrieve the grim situation.
— Governor West Bengal Jagdeep Dhankhar (@jdhankhar1) December 16, 2019
ఇధి ఇలా ఉంటే.. ఎన్ఆర్సీ, పౌరసత్వ బిల్లులు రెండిటినీ తాము వ్యతిరేకిస్తామని ఇప్పటికే మమతా ప్రకటించారు. పౌరసత్వ సవరణ బిల్లు, జాతీయ పౌరుల జాబితా (ఎన్ఆర్సీ) రాజ్యాంగ మౌలిక సూత్రాలకు విరుద్ధమని ఆరోపించారు. ఎన్ఆర్సీని దేశవ్యాప్తంగా అమలు చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారని, పశ్చిమ బెంగాల్లో 30 మంది ఆత్మహత్య చేసుకున్నారని ఇటీవల చెప్పారు.